- బుక్ చేసి 10–15 రోజులవుతున్నా అందట్లె
- పల్లెల్లో నే ప్రభావం ఎక్కు వ..జనాలకు అవస్థలు
- సౌదీ అరేబియా, ముంబై ఘటనల వల్లే కొరత
బతుకమ్మ, దసరా పండుగ వేళ ప్రతి ఇంటికీ గ్యాస్ సిలిండర్ల పరేషాన్ పట్టుకుంది. బుక్ చేసి పది, పదిహేను రోజులైనా గ్యాస్ సిలిండర్ దొరకట్లేదు. పండుగ సీజన్ కావడంతో గ్యాస్ఎప్పుడైపోతుందో.. బండ ఎప్పుడొస్తుందో తెలియక జనం టెన్షన్ పడుతున్నారు. సౌదీ అరేబియాలోని అరామ్కో ఆయిల్ రిఫైనరీపై దాడి, ముంబైలోని పెట్రోలియం కంపెనీలో అగ్ని ప్రమాదం వంటివి గ్యాస్ సరఫరాపై ప్రభావం చూపిస్తున్నాయని చెబుతున్నారు. పండుగ టైమ్లో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడడంతో డిస్ట్రిబ్యూటర్లూ తల పట్టుకుంటున్నారు.
ఏం జరిగిందంటే..
గత నెల14న సౌదీ అరేబియాలోని అరామ్కో ఆయిల్రిఫైనరీపై డ్రోన్ దాడులు జరిగాయి. అప్పటి నుంచి అక్కడ చమురు ఉత్పత్తి ఆగిపోయింది. దాని ప్రభావం మన దేశంతోపాటు ఇతర దేశాలపై పడింది. మనం సౌదీ నుంచే ఎక్కువగా ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాం. అరామ్కోపై దాడి ప్రభావంతో దేశానికి ముడిచమురు దిగుమతులు ఆగిపోయాయి. ఈ నెల 3న ముంబైలోని యురాన్ ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్లో భారీ ఆగ్ని ప్రమాదం జరిగింది. దీంతో అక్కడా ఆయిల్ ప్రాసెసింగ్ నిలిచిపోయింది. ఆ రెండింటి ప్రభావం తెలంగాణతోపాటు చాలా రాష్ట్రాలపై పడింది. పండుగ పూట జనం ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, గ్యాస్ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. అందుబాటులో ఉన్న మొత్తం స్టాక్ను సరఫరా చేశారు. కానీ డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఆ స్టాక్ సరిపోదని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. స్టాక్ మొత్తాన్ని ఒకేసారి సరఫరా చేసి పండుగ టైంలో కొరత నుంచి బయటపడినా పండుగల తర్వాత మళ్లీ గ్యాస్కు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.