అంఫాన్‌ ఎఫెక్ట్:  పశ్చిమ బెంగాల్, ఒడిశాలకు శ్రామిక్ రైళ్లు రద్దు

అంఫాన్‌ ఎఫెక్ట్:  పశ్చిమ బెంగాల్, ఒడిశాలకు శ్రామిక్ రైళ్లు రద్దు

అంఫాన్‌ సూపర్‌ సైక్లోన్‌గా మరింది. దీంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు వెళ్లాల్సిన శ్రామిక్ స్పెషల్ రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. ఇవాళ(బుదవారం) సాయంత్రం పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య తుపాను తీరం దాటనుండగా.. దాని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలులు ఉద్ధృతంగా వీస్తున్నాయి. ఫలితంగా చెట్లు కూలిపోయి… విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో మహారాష్ట్ర నుంచి ఈ రెండు రాష్ట్రాలకు వెళ్లాల్సిన శ్రామిక్ రైళ్లను మే 21వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. చంద్‌బలీ, భువనేశ్వర్, బాలాసోర్‌తోపాటు పారదీప్‌లలో గాలులు వేగంతో వీస్తున్నాయి.