
ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ వెన్ను నొప్పితో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్కు దూరమయ్యాడు. అయితే, ఢిల్లీ వేదికగా ఈ నెల 17 నుంచి జరగబోయే రెండవ టెస్టుకు శ్రేయస్ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వెల్లడించింది. వెన్నునొప్పితో తొలి టెస్టు ఆడని అయ్యర్, నేషనల్ క్రికెట్ అకాడమీలో తాజాగా జరిగిన మెడికల్ టెస్టులో క్వాలిఫై అయ్యాడు. పూర్తి ఫిట్నెస్తో బరిలోకి దిగుతాడని బీసీసీఐ తెలిపింది. ఇదే జరిగితే పంత్ లేని లోటుతో పాటు, భారత్ బ్యాటింగ్ మిడిలార్డర్ మరింత బలంగా తయారవుతుంది.