IND vs AUS: ఆసీస్తో తొలి టెస్టుకు శ్రేయస్ దూరం!

IND vs AUS: ఆసీస్తో తొలి టెస్టుకు శ్రేయస్ దూరం!

స్వదేశంలో ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్ కు ముందు టీమిండియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఫామ్ లో ఉన్న మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఈ సిరీస్ కి దూరమవుతునట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు ముందు శ్రేయస్ అయ్యర్ కు వెన్నుగాయం అయింది. ఆ గాయం నుంచి అతనింకా కోలుకోలేదని బీసీసీఐ వెల్లడించింది. శ్రేయస్ కి మరో రెండు వారాలు విశ్రాంతి అవసరమని NCA సూచించినట్లు తెలుస్తోంది. దీంతో రేపటి నుంచి నాగ్ పూర్ లో జరిగే ట్రైనింగ్ సెషన్స్ కు శ్రేయస్ హాజరు కావట్లేదని సమాచారం. అయితే, శ్రేయస్ అయ్యర్ స్తానంలో సూర్య కుమార్ యాదవ్ ని జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే పంత్ లేని లోటుతో పాటు, మిడిల్ ఆర్డర్ ఇంకా బలంగా తయారవుతుంది.