ఫిబ్రవరి 5న రామానుజ విగ్రహావిష్కరణకు ప్రధాని మోడీ!

ఫిబ్రవరి 5న రామానుజ విగ్రహావిష్కరణకు ప్రధాని మోడీ!

ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు త్రిదండి చినజీయర్ స్వామి. రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు. ఉత్సవాల సందర్భంగా 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహ ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు. చినజీయర్  స్వామితో పాటు మై హోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు కూడా మోడీని కలిశారు. కార్యక్రమానికి తప్పక వస్తానని మోడీ చెప్పారన్నారు.