
ముంబై: శ్రీరామ్ గ్రూప్కు చెందిన శ్రీరామ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ శ్రీరామ్ మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్ను ప్రారంభించింది. ఈక్విటీ, డెట్, బంగారం/వెండి ఈటీఎఫ్ల వంటి వాటిలో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. దీర్ఘకాలంలో భారీగా రాబడిని అందించడం ఈ కొత్త ఫండ్ లక్ష్యం. న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) సెప్టెంబర్ 1, 2023న ముగుస్తుంది.
ఇన్వెస్టర్లు తమ ఆర్థిక కుటుంబ లక్ష్యాలను సాధించడానికి లిక్విడ్ లేదా ఓవర్నైట్ ఫండ్ల నుంచి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (సిప్), టాప్- అప్లు లేదా సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ల (ఎస్టీపీలు) విధానాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. లంప్సమ్కు కనీస పెట్టుబడి మొత్తం రూ.5,000 కాగా, సిప్లకు నెలకు కనీసం రూ.1,000 లేదా మూడు నెలలకు రూ.3,000 కట్టాలి. లాక్-ఇన్ పీరియడ్ లేదు. ఫండ్ కార్పస్లో 65 శాతం నుంచి 80శాతం వరకు ఈక్విటీలో పెట్టుబడి పెడతారు.