43శాతం పెరిగిన కార్ల ఎగుమతులు

43శాతం పెరిగిన కార్ల ఎగుమతులు
  • మొదటి స్థానంలో మారుతి సుజుకీ

న్యూఢిల్లీ: మనదేశం నుండి కిందటి ఫైనాన్షియల్​ ఇయర్ లో కార్ల ఎగుమతులు  43 శాతం పెరిగాయి. మారుతి సుజుకి ఇండియా 2.3 లక్షల యూనిట్లకు పైగా డిస్పాచ్‌లతో  మొదటిస్థానంలో ఉంది. మొత్తం ప్యాసింజర్​ వెహికల్స్​ ఎగుమతులు 2020–-21లో 4,04,397 యూనిట్లు కాగా, 2021–-22 ఫైనాన్షియల్​ ఇయర్​లో 5,77,875 యూనిట్లకు పెరిగాయి.  ప్యాసింజర్ కార్ షిప్‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు 42 శాతం గ్రోత్​తో 3,74,986 యూనిట్లకు చేరుకోగా, యుటిలిటీ వెహికల్స్​ ఎగుమతులు 46 శాతం పెరిగి 2,01,036 యూనిట్లకు చేరుకున్నాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) వెల్లడించింది. వ్యాన్‌‌‌‌ల ఎగుమతులు 2020–-21 ఫైనాన్షియల్​ ఇయర్​లో 1,648 యూనిట్ల నుంచి 2021–-22 ఫైనాన్షియల్​ ఇయర్​లో 1,853 యూనిట్లకు పెరిగాయి.
2,35,670 పీవీలను అమ్మిన మారుతి సుజుకీ
ఎగుమతుల పరంగా 2022 ఫైనాన్షియల్​ ఇయర్​లో మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్​ఐ) మొదటిస్థానంలో,   హ్యుందాయ్ మోటార్ ఇండియా  కియా ఇండియా వరుసగా రెండు,  మూడవ స్థానాల్లో నిలిచాయి. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన ఎంఎస్​ఐ,  2021–2022 ఫైనాన్షియల్​ ఇయర్​లో 2,35,670 పీవీలను ఎగుమతి చేసింది. ఇది 2020–-21 ఫైనాన్షియల్​ ఇయర్​లో 94,938 యూనిట్లను అమ్మింది. అంటే అమ్మకాలు రెండు రెట్లు పెరిగాయి. ఎంఎస్​ఐ  పీవీల ఎగుమతులు ఎక్కువగా లాటిన్ అమెరికా, ఆసియాన్​, ఆఫ్రికా, మిడిల్​ ఈస్ట్​ దేశాలకు  వెళ్లాయి. బాలెనో, డిజైర్, స్విఫ్ట్, ఎస్​-ప్రెస్సో  బ్రెజ్జాలను అత్యధికంగా అమ్మింది.    
రెండోస్థానంలో హ్యుందాయ్​
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫారిన్​ డిస్పాచ్​లు​ పోయిన ఫైనాన్షియల్​ ఇయర్​లో 1,29,260 యూనిట్లుగా ఉన్నాయి. ఇది 2020–-21లో మొత్తం 1,04,342 యూనిట్లను అమ్మింది.    కియా ఇండియా 50,864 యూనిట్లను ఎగుమతి చేసింది. 2020–-21లో 40,458 యూనిట్లను ఎగుమతి చేసింది. ఫోక్స్‌‌‌‌వ్యాగన్  2022 ఫైనాన్షియల్​ ఇయర్​లో 43,033 యూనిట్లను ఎగుమతి చేయగా, 2021  ఫైనాన్షియల్​ ఇయర్​లో 31,089 యూనిట్లను ఎగుమతి చేసింది. రెనాల్ట్ ఇండియా 24,117 యూనిట్లను ఎగుమతి చేసింది.