
సిద్దిపేట, వెలుగుః జిల్లా వ్యాప్తంగా మంగళ వారం నుంచి ఈనెల 20 వ తేదీ వరకు భూ సమస్యలపై అధికారులు గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. సిద్దిపేట జిల్లాలో మొత్తం 386 రెవెన్యూ గ్రామాలు 499 గ్రామ పంచాయతీలున్నాయి. వీటి పరిధిలో 3,54,739 మంది పట్టాదారులుండగా 5522 ఖాతాలు పార్టీ బీ లో నమోదై ఉన్నాయి.
ఆయా మండలాల తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దార్ల ఆధ్వర్యంలో నిర్వహించే రెవెన్యూ సదస్సుల షెడ్యూ ల్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సూచించిన 25 అంశాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం పై రైతుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తారు.