
జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అంతర్జాతీయ క్రికెట్ లో తన టాప్ ఫామ్ కొసాగిస్తున్నాడు. ముఖ్యంగా వన్డే క్రికెట్ లో ఈ ఆల్ రౌండర్ అదే పనిగా చెలరేగుతున్నాడు. బ్యాటింగ్ లో మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతూ, బౌలింగ్ లో మ్యాజిక్ చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లోనూ జట్టు విజయం కోసం తీవ్రంగా పోరాడుతున్నాడు. ఇటీవలే శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో రజా అద్భుతంగా రాణించాడు. రెండు మ్యాచ్ ల్లోనూ హాఫ్ సెంచరీ చేసి వన్డే ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానానికి చేరుకున్నాడు. బుధవారం (సెప్టెంబర్ 3) ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (296)ను వెనక్కి నెట్టి రజా (302) టాప్ కు చేరుకున్నాడు.
మొదటి వన్డేలో బ్యాటింగ్ లో 92 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచిన ఈ జింబాబ్వే ఆల్ రౌండర్.. ఒక వికెట్ పడగొట్టాడు. రెండో వన్డేలో బ్యాటింగ్ లో 59 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మూడో స్థానంలో మహమ్మద్ నబీ, నాలుగో స్థానంలో మెహదీ హసన్ మిరాజ్ ఉన్నారు. టీమిండియాలో రవీంద్ర జడేజా 9 వ స్థానంలో నిలిచాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో కూడా రజా దూసుకొచ్చాడు. 9 స్థానాలు ఎగబాకి 22 వ స్థానానికి చేరుకున్నాడు.
ALSO READ : Asia Cup 2025: తుది జట్టు నుంచి తిలక్ వర్మను తప్పించండి.. శాంసన్కు సపోర్ట్గా భారత మాజీ క్రికెటర్
తొలి స్థానంలో టీమిండియా ఓపెనర్ శుభమాన్ గిల్ (784) కొనసాగుతున్నాడు. బాబర్ (751) ను వెనక్కి నెట్టి రోహిత్ (756) రెండో ర్యాంక్ కు చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ (736) నాలుగో స్థానంలో నిలిచాడు. డారిల్ మిచెల్ టాప్-5 బ్యాటర్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఇతర భారత క్రికెటర్లలో శ్రేయాస్ అయ్యర్ 8 వ ర్యాంక్ లో నిలిచాడు. వికెట్ కీపర్ బ్యాటర్ రాహుల్ 15 ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. బౌలింగ్ లో సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంక స్పిన్నర్ మహీష్ తీక్షణ రెండో స్థానంలో.. కుల్దీప్ యాదవ్ ర్యాంక్ లో ఉన్నారు. ఒక స్థానం మెరుగుపర్చుకొని జడేజా 9 ర్యాంక్ లో నిలిచాడు.