
షెన్జెన్ (చైనా): ఇండియా స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి చైనా మాస్టర్స్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు21-–15, 21–-15తో థాయ్లాండ్కు చెందిన పొర్న్పావీ చోచువాంగ్పై వరుస గేమ్స్లో నెగ్గింది. మెన్స్ డబుల్స్ ప్రిక్వార్టర్స్లో సాత్విక్–చిరాగ్ జంట 21–-13, 21–-12తో సియాంగ్ చిహ్ చియు– వాంగ్ చి-లిన్ (చైనీస్ తైపీ) జోడీని ఓడించి ముందంజ వేసింది.