ప్రిక్వార్టర్స్‌‌లో సింధు, ప్రణయ్‌‌

ప్రిక్వార్టర్స్‌‌లో సింధు, ప్రణయ్‌‌

జకర్తా: ఇండియా స్టార్‌‌ షట్లర్‌‌ పీవీ సింధు ఫామ్‌‌లోకి వచ్చింది. ఇండోనేసియా ఓపెన్‌‌ వరల్డ్‌‌ టూర్‌‌ సూపర్‌‌ 1000 టోర్నమెంట్‌‌లో శుభారంభం చేసింది. మెన్స్‌‌లో హెచ్‌‌ఎస్‌‌ ప్రణయ్‌‌ కూడా బోణీ చేశాడు. మంగళవారం జరిగిన విమెన్స్‌‌ సింగిల్‌‌ తొలి రౌండ్‌‌లో డబుల్‌‌ ఒలింపిక్‌‌ మెడలిస్ట్‌‌ సింధు 21–19, 21–15తో  మరిస్కా (ఇండోనేసియా)ను వరుస గేమ్స్‌‌లో చిత్తు చేసి ప్రి క్వార్టర్స్‌‌లో అడుగు పెట్టింది. విమెన్స్‌‌ డబుల్స్‌‌లో  పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ  తొలి రౌండ్‌‌లో 22–-20, 12-–21, 16-–21తో రిన్‌‌ ఇవానగ–కియో నకానిషి (జపాన్‌‌) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది.

మెన్స్‌‌ సింగిల్స్‌‌లో ఏడో సీడ్‌‌ ప్రణయ్‌‌ 21–16, 21–14తో కెంటా నిషిమోటో (జపాన్‌‌)పై వరుస గేమ్స్‌‌లో గెలిచి ప్రిక్వార్టర్స్‌‌ చేరాడు.  డబుల్స్‌‌లో ఏడో సీడ్‌‌ సాత్విక్‌‌ సాయిరాజ్‌‌–చిరాగ్‌‌ షెట్టి జంట 21–12, 11–7తో లీడ్‌‌లో ఉన్న టైమ్‌‌లో ప్రత్యర్థి జంట  క్రిస్టో పొపోవ్‌‌–తోమా పొపోవ్‌‌  (బల్గేరియా) రిటైర్‌‌ అయింది. దాంతో ఇండియా జోడీ  నేరుగా రెండో రౌండ్‌‌ చేరింది. కానీ, మరో మ్యాచ్‌‌లో ఎంఆర్‌‌ అర్జున్‌‌–ధ్రువ్‌‌ కపిల జంట ఓడిపోయి ఇంటిదారి పట్టింది.