
రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: ఫేషియల్ రికగ్నిషన్ యాప్లో తప్పుడు అటెండెన్స్ నమోదు చేసిన జీపీ కార్యదర్శులపై వేటు పడింది. రంగారెడ్డి జిల్లాలోని ఆమన్గల్ మండలం సింగంపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి జంగయ్య, ఫరూక్ నగర్ మండలం భీమరం గ్రామపంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్ ఫేషియల్ రికగ్నిషన్ యాప్లో తప్పుడు అటెండెన్స్ నమోదు చేసినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఇద్దరిని సస్పెండ్ చేస్తూ డీపీవో సురేశ్ మోహన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫరూక్ నగర్ మండలం రామేశ్వరం పంచాయతీ కార్యదర్శి రమేశ్ను ఒక రోజు సర్వీస్ నుంచి తొలగించారు. మరో 8 మంది కార్యదర్శులపై చర్యలకు కలెక్టర్ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు.