భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఈ నెల 23న ఘనంగా నిర్వహించనున్నట్టు సింగరేణి జీఎం వెల్ఫేర్ జీవి కిరణ్ కుమార్ తెలిపారు. ఏర్పాట్లపై కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్లో గురువారం నిర్వహించిన రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు. హెడ్డాఫీస్తో పాటు అన్ని ఏరియాల్లో ఆఫీసులను విద్యుత్ లైట్లతో అలంకరించాలన్నారు.
స్టేడియంలో ప్రగతి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఆవిర్భావ వేడుకల్లో కార్మికులు, కార్మిక కుటుంబాలు, పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సింగరేణి ఆఫీసర్లు బి. సీతారామమ్, ఎం. ఉష, మురళీ ధరరావు, ముకుంద సత్యనారాయణ, వరప్రసాద్, శాస్త్రి, రాజశేఖర్, రాజ్ కుమార్, జాకీర్ హుస్సేన్ పాల్గొన్నారు.

