కార్మికుల పిల్లల కోసమే చెమట చుక్కలకు తర్ఫీదు : సింగరేణి సీఎండీ బలరాం

కార్మికుల పిల్లల కోసమే చెమట చుక్కలకు తర్ఫీదు : సింగరేణి సీఎండీ బలరాం
  • సింగరేణి సీఎండీ బలరాం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలతో పాటు ప్రాజెక్టు ప్రభావిత పిల్లల కోసమే చెమట చుక్కలకు తర్ఫీదు ప్రోగ్రామ్​ను నిర్వహిస్తున్నామని సింగరేణి సీఎండీ ఎన్​. బలరాం పేర్కొన్నారు. కొత్తగూడెం ఏరియా ఆర్​సీ ఓఏ క్లబ్​లో ఆదివారం నిర్వహించిన చెమట చుక్కలకు తర్ఫీదు ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. కార్మికులు చెమట అయితే వారి పిల్లలు చుక్కలు లాంటి వారని అన్నారు. 

దేశంతో పాటు విదేశాల్లో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై ఈ ప్రోగ్రాం ద్వారా అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  ఇటీవల హైదరాబాద్​లో జరిగిన ప్రోగ్రాంలో దీన్ని అధికారికంగా లాంచ్​ చేశారని, సింగరేణిలో మొదటి సారిగా కొత్తగూడెం ఏరియాలో ప్రారంభించినట్లు తెలిపారు. 

దశల వారీగా సింగరేణి వ్యాప్తంగా ఈ ప్రోగ్రాంను విస్తరించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, తిరుమలరావు, ఏరియా జీఎం షాలెం రాజు, ఎస్వోటూజీఎం కోటిరెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్​ పల్లె రవికుమార్, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నేతలు వాసిరెడ్డి సీతారామయ్య, త్యాగరాజన్​, గట్టయ్య, ఎండీ రజాక్​, సీఎంఓఏఐ ఏరియా అధ్యక్షడు నరసింహారావు పాల్గొన్నారు.