సింగరేణిలో పలువురు ఆఫీసర్ల బదిలీ

సింగరేణిలో పలువురు ఆఫీసర్ల బదిలీ

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణిలో ఆఫీసర్లను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్తగూడెం ఏరియాలోని వీకే ఓసీపీ పీవో అడిషనల్​జీఎం శ్రీరమేశ్​ను మణుగూరు ఏరియాకు, కొత్తగూడెం ఏరియా కిష్టారం ఓసీపీ అడిషనల్​జీఎం వేదాద్రి నర్సింహారావు వీకే ఓసీపీకి బదిలీ అయ్యారు. 

భూపాలపల్లి ఏరియా సేఫ్టీ ఆఫీసర్​డిప్యూటీ జీఎం గంగా లలితేంద్రప్రసాద్​ మందమర్రి ఏరియా కొత్త ఏస్వో టు జీఎంగా నియమిస్తూ, అదనంగా రామకృష్ణాపూర్​ ఓసీపీ పీవో బాధ్యతలు అప్పగించింది. రామగుండం–3 ఏరియా ఓసీపీ–1 డీజీఎం రాజశేఖర్​ను ఓసీపీ–2కు, భూపాలపల్లి ఏరియా గ్రూప్​–1ఏఓ డీజీఎం మటూరి రవీందర్  భూపాలపల్లి సేఫ్టీ ఆఫీసర్​గా, రామగుండం–3 ఎస్ఎంఎస్​ప్లాంట్ డీజీఎం ప్రవీణ్​వి పాటింగ్​ను రామగుండం –3 ఓసీపీ–1కు, మందమర్రి ఏరియా ఎంవీటీసీ డీజీఎం జి.శంకర్​ను రామగుండం –3 ఏరియా సేఫ్టీ ఆఫీసర్​గా, కార్పొరేట్ ఆర్​అండీ డీజీఎం సునీల్​వర్మను సత్తుపల్లి ఏరియా కిష్టారం ఓసీ పీవోగా, భూపాలపల్లి ఏరియా కేటీకే –1 గని డీజీఎం తిరుపతిని అదే ఏరియాలోని గ్రూప్​-–1 ఏఓగా, కార్పొరేట్​పర్చేజ్​ డీజీఎం మురళిని కార్పొరేట్ ఆర్​అండ్​డీ వింగ్​కు ట్రాన్స్ ఫర్ అయ్యారు. 

భూపాలపల్లి ఏరియా కేటీకే ఓసీపీ –3 అడిషనల్ మేనేజర్​ మధుసూదన్​ను బెల్లంపల్లి రీజియన్​ ఎంవీటీసీకి, రామగుండం –2 ఏరియా ఎన్విరాన్​మెంట్ సెల్​ అడిషనల్​ మేనేజర్​సురేశ్​బాబును ఆర్జీ –2 ఎంవీటీసీకి, రామగుండం –2 ఏరియా ఓసీపీ –3 అడిషనల్ ​మేనేజర్​ శ్రీధర్​ను మందమర్రి ఏరియా ఎంవీటీసీకి, మణుగూరు ఏరియా ఎంఓసీ అడిషనల్​మేనేజర్​అనిల్​కుమార్​ను కొత్తగూడెం వీకే ఓసీపీకి, కొత్తగూడెం ఏరియా పీవీకే –5 గని డిప్యూటీ మేనేజర్ ​భరత్​చంద్రను కొత్తగూడెం వీకే ఓసీపీకి, రామగుండం –2 ఓసీపీ –3 ఎస్ఈ వేణుకుమార్​ను ఆర్జీ –2 ఏరియా ఎన్విరాన్​మెంట్​సెల్​కు, అడ్రియాల ప్రాజెక్ట్​ సీనియర్ అండర్ ​మేనేజర్​ వివేకానందను మణుగూరు ఏరియా కొండపూరం మైన్​కు,కొత్తగూడెం ఏరియా పీవీకే- –5 గని మైనింగ్​ట్రైనీ రమ్యశ్రీని కొత్తగూడెం వీకే ఓసీపీకి బదిలీ చేస్తూ సింగరేణి జీఎం(పర్సనల్,ఈఈ అండ్​ఆర్​సీ) మురళీధర్​ ఉత్తర్వులు జారీ చేశారు.