సింగరేణి వ్యాప్తంగా 6.68 కోట్ల మొక్కలు నాటాం

సింగరేణి వ్యాప్తంగా 6.68 కోట్ల మొక్కలు నాటాం

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణి వ్యాప్తంగా ఇప్పటి వరకు 16,790 హెక్టార్లలో 6.68 కోట్ల మొక్కలు నాటామని సింగరేణి కాలరీస్​ కంపెనీ డైరెక్టర్లు ఎల్​వీ.సూర్యనారాయణ, కొప్పుల వెంకటేశ్వర్లు, ఎం.తిరుమలరావు తెలిపారు. శుక్రవారం కొత్తగూడెంలోని సింగరేణి బంగ్లోస్​ ఏరియా సింగరేణి ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. అనంతరం సింగరేణి హెడ్డాఫీస్​లో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో వారు మాట్లాడారు. 

గాలి, నీరు, భూమి కాలుష్యం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో సోలార్​ విద్యుత్​కు సింగరేణి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అనంతరం మినిస్ట్రీ ఆఫ్​ కోల్​ నిర్వహించిన స్టార్​ రేటింగ్​లో ఫైవ్​ స్టార్​ రేటింగ్​ కలిగి పర్యావరణ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన ఖైరిగూడ ఓపెన్​కాస్టు, రవీంద్రఖని న్యూటెక్​ అండర్​ గ్రౌండ్​ మైన్​కు ఉత్తమ ఎకో ఫ్రెండ్లీ మైన్ అవార్డులను డైరెక్టర్లు అందజేశారు.