
గోదావరిఖని, వెలుగు: సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు రేషన్కార్డులు జారీ చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దండంరాజు రాంచందర్రావు కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి వినతిపత్రం అందజేశారు. రేషన్ కార్డులతో పాటు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ విషయంపై మంత్రి సానుకూలంగా స్పందించారని, కార్డుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని రాంచందర్రావు తెలిపారు.