- ప్రాసెస్ తర్వాత ల్యాండ్ ను సింగరేణికి అప్పగింత
- లేఖ రాసిన ఆర్ఆర్వీయూఎన్ ఎల్
గోదావరిఖని, వెలుగు : తెలంగాణలో బొగ్గు, విద్యుత్, సోలార్ఉత్పత్తిని సాధిస్తూనే సింగరేణి ఇతర రాష్ట్రాల్లో సోలార్ పవర్ జనరేట్ చేయడంపైనా ఫోకస్ చేసింది. ఇందుకు త్వరలోనే రాజస్థాన్లో సోలార్ పార్క్ లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆ రాష్ట్ర ఎనర్జీ విభాగానికి సింగరేణి లేఖ రాసింది. ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించడానికి అభ్యంతరం లేదని రాజస్థాన్సర్కార్ కూడా ఆమోదం తెలిపింది. త్వరలో తెలంగాణ క్యాబినెట్మీటింగ్ లో చర్చించిన తర్వాత ప్రత్యేక బృందం ఆ రాష్ట్రంలో పర్యటించనుంది.
7,364 ఎకరాల భూమి కేటాయింపునకు ఓకే
సోలార్పవర్ప్లాంట్లను(రెన్యూవబుల్ఎనర్జీ పార్కులు) ఏర్పాటు చేస్తామని, ఇందుకు కావాలసిన భూమిని ఇవ్వాలని రాజస్థాన్రాష్ట్ర విద్యుత్ఉత్పాదన నిగమ్లిమిటెడ్(ఆర్ఆర్ వీయూఎన్ఎల్)కు కొన్నాళ్లకింద సింగరేణి లేఖ రాసింది. దీనిపై ఆ సంస్థ సానుకూలంగా స్పందించింది. వెంటనే ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియను మొదలు పెట్టింది.
బికనేర్లోని సవైసార్లో 880 హెక్టార్లు, జైసల్మేర్లోని పతేగఢ్లో 1500 హెక్టార్లు, బోడానాలో 600 హెక్టార్లలో సోలార్పార్క్లకు మొత్తంగా 2,980 హెక్టార్ల (7,364 ఎకరాలు) భూమిని రిజర్వ్చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భూమి కేటాయింపు పనులు ప్రాసెస్లో ఉండగా.. త్వరలోనే స్వాధీనం చేసేందుకు సింగరేణి చర్యలు తీసుకోనుంది. మరోవైపు సోలార్ పార్క్ ల నిర్మాణాలను వేగంగా కొనసాగించాలని కోరుతూ ఆర్ఆర్ వీయూఎన్ఎల్సంస్థ చీఫ్ ఇంజినీర్విష్ణు ప్రకాశ్గార్గ్ ఇటీవల సింగరేణి పవర్ప్రాజెక్ట్స్విభాగానికి చెందిన హెచ్ఓడీకి లేఖ రాశారు.
రాష్ట్రంలో ఇప్పటికే 245.5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి
ఇల్లందు, కొత్తగూడెం, ఎస్టీపీపీ, ఆర్జీ –3 సెంటినరీ కాలనీ, మందమర్రి తదితర ఏరియాల్లో ఇప్పటికే 245.5 మెగావాట్ల సోలార్విద్యుత్ను సింగరేణి ఉత్పత్తి చేస్తోంది. దీనికితోడు మల్లన్నసాగర్, లోయర్మానేరు డ్యామ్, జైపూర్ఎస్టీపీపీ రిజర్వాయర్పై ఫ్లోటింగ్సోలార్పవర్ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. తాజాగా రాజస్థాన్లో సోలార్పవర్జనరేషన్ప్లాంట్లను ఏర్పాటు చేసే పనిలో సింగరేణి నిమగ్నమైంది.
సోలార్పార్క్లను ఏర్పాటు చేస్తాం
రాజస్థాన్రాష్ట్ర విద్యుత్సంస్థ ఎక్కువ సోలార్ పవర్ ఉత్పత్తి చేయాలని సింగరేణిని కోరింది. దీనిపై స్పందిస్తూ లేఖ రాయగా 7 వేల ఎకరాలకుపైగా భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రాసెస్కంప్లీట్కాగానే రాజస్థాన్లో 1,500 మెగావాట్ల సోలార్ పవర్ పార్క్లను ఏర్పాటు చేస్తాం.- ఎన్.బలరామ్నాయక్, సింగరేణి సీఎండీ
