
కోల్బెల్ట్, వెలుగు: జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మందమర్రి ఏరియాలోని సులభ్కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా చేపట్టారు. సింగరేణి సులభ్వర్కర్స్ యూనియన్(ఇప్టూ) ఆధ్వర్యంలో మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి ప్రాంతాల కాంట్రాక్ట్ కార్మికులు బుధవారం మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఆఫీస్ఎదుట ఆందోళనకు దిగారు. ర్యాలీగా వచ్చి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని . సింగరేణి ఆఫీసర్లకు అందజేశారు. ధర్నాలో లీడర్లు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న తమకు యాజమాన్యం సక్రమంగా వేతనాలు చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఏప్రిల్నెల జీతం రాలేదన్నారు.
వేతనాలు టైమ్కు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం జీతాలు రిలీజ్చేయాలని డిమాండ్ చేశారు. వారు ధర్నా చేస్తున్న సమయంలో వర్షం పడగా దాన్ని లెక్కచేయకుండా ఆందోళన కొనసాగించారు. ఇప్టూ రీజియన్ ప్రెసిడెంట్ ఎండీ జఫర్, సెక్రటరీ టి.శ్రీనివాస్, లీడర్లు ఎం.సురేందర్, అజయ్, కనుకయ్య, మల్లేశ్, వెంకటి తదితరులు పాల్గొన్నారు.