
మళయాళం ప్రముఖ నేపథ్య గాయకుడు ఎడవ బషీర్ కన్నుమూశారు. అలప్పుజలో జరిగిన బ్లూ డైమండ్ ఆర్కెస్ట్రా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ఆయన.. స్టేజ్ పై పాట పాడుతూ ప్రేక్షకులు అందరూ చూస్తుండగానే అకస్మాత్తుగా కుప్పకూలారు. పలువురు వెంటనే స్పందించి,... దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. ఈ ఘటన శనివారం రాత్రి 9.30గంటలకు జరిగినట్టు సమాచారం.
బషీర్ తిరువనంతపురం జిల్లాలోని వర్కాల దగ్గర్లో ఉన్న ఎడవ అనే ప్రాంతంలో జన్మించారు. ఆయన తన పాఠశాల విద్యాభ్యాసం తర్వాత కొల్లాంకు శాశ్వత మకాం మార్చారు. ఇకపోతే ఇతను రఘు వంశం అనే సినిమాకు మొదటిసారిగా నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యారు. అంతే కాకుండా ఆల్ కేరళ మేజీషియన్స్ అండ్ టెక్నిషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు రాష్ట్ర అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వహించారు. దీనికి తోడు సంగీతాలయ అనే మ్యూజిక్ ట్రూప్ ను కూడా లాంచ్ చేశారు.
Warning: Disturbing Content
— Bobins Abraham Vayalil (@BobinsAbraham) May 29, 2022
Singer dies during live performance.
Malayalam singer #EdavaBasheer died after collapsing on the stage while singing.
The 78-year-old was performing at the Golden jubilee of Blue Diamonds orchestra. pic.twitter.com/k6CCfhafjO
మరిన్ని వార్తల కోసం...
ఏడాది చివరి నాటికి కొత్త పంబన్ వంతెన పూర్తి
నయన్ -విఘ్నేశ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో !