రిసార్ట్స్లో బర్త్ డే పార్టీ.. మంగ్లీపై కేసు.. మరో ముగ్గురిపై కూడా..

రిసార్ట్స్లో బర్త్ డే పార్టీ.. మంగ్లీపై కేసు.. మరో ముగ్గురిపై కూడా..

 

గండిపేట, వెలుగు: చేవెళ్ల సమీపంలోని ఓ రిసార్ట్స్​లో మంగళవారం రాత్రి బర్త్​డే పార్టీ చేసుకున్న సింగర్​మంగ్లీతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్స్‌‌లో తన తల్లిదండ్రులు, బంధుమిత్రులకు ఆమె బర్త్​డే పార్టీ ఏర్పాటు చేసింది. అయితే, లిక్కర్​కు, డీజే సౌండ్​సిస్టమ్​కు పర్మిషన్​తీసుకోకపోవడంతో ఎస్‌‌ఓటీ, లోకల్‌‌ పోలీసులు రైడ్స్​చేశారు. 

ఈ సందర్భంగా అనుమానంతో 25 మందికి డ్రగ్స్​పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఒకరు గంజాయి తీసుకున్నట్టు తేలింది. దీంతో రిసార్ట్‌‌ మేనేజర్‌‌ శివరామకృష్ణ, డీజే ఆపరేటర్‌‌ మేఘనాథ్, సింగర్​మంగ్లీ, గాంజా తీసుకున్న దామోదర్‌‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ శ్రీనివాస్‌‌  తెలిపారు. నలుగురికి నోటీసులిచ్చి విచారణ చేపడుతున్నామన్నారు. 

పర్మిషన్​తీసుకోవాలని తెలియదు

ఘటనపై మంగ్లీ స్పందించి ఓ వీడియో రిలీజ్​చేసింది. ఆధారాలు లేకుండా అభియోగాలు మోపవద్దని రిక్వెస్ట్​చేసింది. తన బర్త్​డే సందర్భంగా చిన్న పార్టీ చేసుకున్నామని,  విదేశీ మద్యం, డ్రగ్స్​అందులో లేవని స్పష్టం చేసింది. గంజాయి పాజిటివ్​ వచ్చిన వ్యక్తి కూడా ఎక్కడో తీసుకొని పార్టీకి వచ్చాడని పేర్కొంది. లిక్కర్​కు, సౌండ్​కు పర్మిషన్​తీసుకోవాలని తనకు తెలియదని, ఎవరూ గైడెన్స్​ఇవ్వలేదని, తెలియకుండా జరిగిందని వివరించింది.