
గండిపేట, వెలుగు: చేవెళ్ల సమీపంలోని ఓ రిసార్ట్స్లో మంగళవారం రాత్రి బర్త్డే పార్టీ చేసుకున్న సింగర్మంగ్లీతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్స్లో తన తల్లిదండ్రులు, బంధుమిత్రులకు ఆమె బర్త్డే పార్టీ ఏర్పాటు చేసింది. అయితే, లిక్కర్కు, డీజే సౌండ్సిస్టమ్కు పర్మిషన్తీసుకోకపోవడంతో ఎస్ఓటీ, లోకల్ పోలీసులు రైడ్స్చేశారు.
ఈ సందర్భంగా అనుమానంతో 25 మందికి డ్రగ్స్పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఒకరు గంజాయి తీసుకున్నట్టు తేలింది. దీంతో రిసార్ట్ మేనేజర్ శివరామకృష్ణ, డీజే ఆపరేటర్ మేఘనాథ్, సింగర్మంగ్లీ, గాంజా తీసుకున్న దామోదర్రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. నలుగురికి నోటీసులిచ్చి విచారణ చేపడుతున్నామన్నారు.
పర్మిషన్తీసుకోవాలని తెలియదు
ఘటనపై మంగ్లీ స్పందించి ఓ వీడియో రిలీజ్చేసింది. ఆధారాలు లేకుండా అభియోగాలు మోపవద్దని రిక్వెస్ట్చేసింది. తన బర్త్డే సందర్భంగా చిన్న పార్టీ చేసుకున్నామని, విదేశీ మద్యం, డ్రగ్స్అందులో లేవని స్పష్టం చేసింది. గంజాయి పాజిటివ్ వచ్చిన వ్యక్తి కూడా ఎక్కడో తీసుకొని పార్టీకి వచ్చాడని పేర్కొంది. లిక్కర్కు, సౌండ్కు పర్మిషన్తీసుకోవాలని తనకు తెలియదని, ఎవరూ గైడెన్స్ఇవ్వలేదని, తెలియకుండా జరిగిందని వివరించింది.