![రేవంత్తోనే కాంగ్రెస్కు ప్రమాదం : సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి](https://static.v6velugu.com/uploads/2023/10/singireddy-somesekhar-reddy-alleged-that-revanth-is-a-danger-to-the-congress-party-in-telangana_LcjiYnMd6x.jpg)
- రేవంత్తోనే కాంగ్రెస్కు ప్రమాదం
- కాంగ్రెస్ నేత సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి
- పార్టీని నాశనం చేయాలని చూస్తున్నడని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ వల్ల ప్రమాదం పొంచి ఉందని ఆ పార్టీ ఉప్పల్ నియోజక వర్గం బి–బ్లాక్ అధ్యక్షుడు, సీనియర్ నేత సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. పార్టీని నాశనం చేయాలనే రేవంత్ కంకణం కట్టుకున్నారని అన్నారు. ఆదివారం ఆయన కార్పొరేటర్ శిరీషతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఉప్పల్ సెగ్మెంట్ నుంచి సోమశేఖర్ రెడ్డి పార్టీ టికెట్ను ఆశించారు.
మొదటి విడతలో ఆయనకు కాకుండా పరమేశ్వర్ రెడ్డికి కేటాయించారు. దీంతో రేవంత్పై సోమశేఖరరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను 30 ఏండ్లుగా కాంగ్రెస్ని నమ్ముకుని అనేక హోదాల్లో పని చేశానని గుర్తుచేశారు. పార్టీకి కట్టుబడి పని చేసిన తనకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆవే దన వ్యక్తం చేశారు. పార్టీ తనకు టికెట్ ఇవ్వక పోవ డంతో తాను, తన సతీమణి శిరీష రాజీనామా చేస్తున్నట్టు ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు లేఖ పంపినట్లు తెలిపారు.
అధికారమిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తడు..
రేవంత్కు అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని అమ్మేస్తారని సోమశేఖర్ విమర్శించారు. ఉప్పల్లో డమ్మీ అభ్యర్థిని పెట్టి అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారన్నారు. ‘‘ఉప్పల్లో కాంగ్రెస్ గెలిస్తే ఆస్తి రాసిస్తా. నేను రేవంత్ రెడ్డికి సన్నిహితుడిని. ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీతోనే ఉన్న.2014లో టికెట్ అన్నరు. ఆ తర్వాత 2018లో అన్నరు. ఇప్పుడు కూడా ఇవ్వలేదు. కనీసం సెకండ్ ఆప్షన్ గా కూడా నా పేరు స్క్రీనింగ్ కమిటీలో పెట్టలేదు”అని సోమశేఖర్ వాపోయారు.
తన అడుగులు రేవంత్ పతనం వైపేనని, పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో రేవంత్ హఠావో, కాంగ్రెస్ బచావో అనే నినాదంతో పర్యటిస్తానని తెలిపారు. తెలంగాణలో రేవంత్ చేస్తున్న అక్రమాలపై ఖర్గేకు లేఖ రాసినట్టు ఆయన తెలిపారు.