కరోనా పంజా..ఒక్కరోజే దేశంలో 1007 మంది మృతి

కరోనా పంజా..ఒక్కరోజే దేశంలో 1007 మంది మృతి

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఒక్కరోజే 62,064 కరోనా కేసులు నమోదవ్వగా అత్యధికంగా 1007 మంది చనిపోయారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మొత్తం 22,15,075 కు చేరగా ..మృతుల సంఖ్య 44,386కు చేరింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నుంచి 1535744 మంది కోలుకున్నారు ఇంకా 6,34,945 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇక నిన్న ఒక్కరోజే 4,77,023 టెస్టులు చేశారు. ఆగస్టు 09 వరకు దేశ వ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్య 2,45,83,558 కు చేరింది.