భారత్ లో 65 వేలు దాటిన కరోనా మరణాలు

భారత్ లో 65 వేలు దాటిన కరోనా మరణాలు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.గత  కన్ని రోజులుగా ప్రతిరోజు 75 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా..గడిచిన 24 గంటల్లో 69,921 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 36,91,167 కు చేరింది. నిన్న ఒక్కరోజే 819 మంది చనిపోయారు.దీంతో మరణాల సంఖ్య 65,288 కి చేరింది. దేశంలో మొత్తం  28,39,167 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 7,85,996 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసుల్లో భారత్ మూడవ స్థానంలో ఉండగా..మరణాల్లో కూడా మూడవ స్థానంలో ఉంది.

see more news

ఆక్సిజన్ సిలిండర్ లీకేజీ..ఊపిరాడక పేషెంట్ మృతి

కలెక్టర్ రేట్ లో రైతుల ఆత్మ హత్యాయత్నం