శ్రీవిష్ణు హీరోగా కార్తీక్ రాజు రూపొందించిన చిత్రం ‘సింగిల్’. కేతిక శర్మ, ఇవాన హీరోయిన్స్. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. మే 9న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సమ్మర్ బ్లాక్ బస్టర్గా నిలిచిందని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్కు దర్శకులు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, తిరుమల కిశోర్, హాసిత్ గోలి, వివేక్ ఆత్రేయ, రామ్ అబ్బరాజు హాజరై ఈ సినిమాను చాలా ఎంజాయ్ చేశామని చెప్పారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘సినిమా బాగుంటే థియేటర్స్కి వస్తాము అని నిరూపించిన ఆడియెన్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. యువ దర్శకులంతా వచ్చి ఈ సక్సెస్ని సెలబ్రేట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది’ అని అన్నారు. శ్రీ విష్ణు మాట్లాడుతూ ‘మంచి టీంతో చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ కొడితే బావుంటుందని అనుకున్నాను. అది జరిగింది.
హానెస్ట్గా సిన్సియర్గా ఏది చేసినా దేవుడు మనకి ఇచ్చేస్తాడు. ఈ సినిమా విజయం, అరవింద్ గారితో జర్నీ చాలా ఎంజాయ్ చేశాను. థియేటర్స్ అన్నీ నవ్వులతో నిండాయి. ఈ సినిమాని ప్రేక్షకులు ఇంకా చాలా రోజులు ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు. ఈ సినిమాని జీవితాంతం మర్చిపోలేను అని చిత్ర దర్శకుడు కార్తీక్ రాజు చెప్పాడు. ఈ సక్సెస్పై చాలా హ్యాపీగా ఉన్నామని నటీనటులు, నిర్మాతలు చెప్పారు.
