ఈ ఏడాది నవంబర్ నెలలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది : ఆక్స్ ఫర్డ్ సైంటిస్ట్

ఈ ఏడాది నవంబర్ నెలలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది : ఆక్స్ ఫర్డ్ సైంటిస్ట్

కరోనా వైరస్ ప్రపంచదేశాలు ఉక్కిరి బిక్కిరి అవుతుంటే..కరోన్ వైరస్ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి వస్తుందంటూ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్ ప్రకటించారు.

ఇండియా టైమ్స్ కథనం ప్రకారం..ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ ను కనిపెట్టేందుకు సైంటిస్ట్ లు పోటీపడుతున్నారు.ఓ టీకాను తయారు చేసి ఆ టీకాను వివిధ దశల వారీగా మూగజీవాల్లో ప్రయోగించి ఆ తరువాత మనుషులపై ప్రయోగిస్తారు. ప్రయోగాల్లో విజయం సాధిస్తే టీకా అందుబాటులోకి వస్తుంది.

తాజాగా ఆ ప్రయోగాలు విజయవంతం అవుతున్నట్లు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ కరోనా వైరస్ వ్యాక్సిన్ ను డెవలప్ చేస్తున్న సైంటిస్ట్ ల బృందానికి నాయకత్వం వహిస్తున్న జాన్ బెల్ ప్రకటించారు. యూకేకి చెందిన ప్రముఖ మీడియా సంస్థ లీడింగ్ బ్రిటన్ కన్వర్ జేషన్ తో మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాక్సిన్ ను సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని అన్నారు. సాధారణంగా ఓ వ్యాక్సిన్ ను తయారు చేయాలంటే 8సంవత్సరాలు పడుతుందని కానీ తమ సైంటిస్ట్ లు అహర్నిశలు కృషి చేస్తూ కేవలం 18వారాల్లో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తున్నారని అన్నారు. అన్నీ అనుకున్నట్లు ప్రణాళిక బద్ధంగా జరిగితే వ్యాక్సిన్ నవంబర్ కల్లా అందుబాటులోకి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు తాము అభివృద్ధి చేస్తున్న టీకాతో జెన్నర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ సైంటిస్ట్ లు ప్రయోగాలు చేసుకోవచ్చన్నారు. దీంతో టీకా ను అభివృద్ధి చేయడం ఈజీ అవుతుందని యూకేకి చెందిన మరో మీడియా సంస్థ ఎక్స్ ప్రెస్ యూకేకి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్ జాన్ బెల్ తెలిపారు.

కాగా ప్రస్తుతం సైంటిస్ట్ జాన్ బెల్ సారధ్యంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ డెవలప్ చేస్తున్న ఆస్ట్రా జెన్ కా టీకాను యూకేలో 2/3 క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి. అదే టీకాను జులైలో బ్రెజిల్ లో 2వేల మందిపై ట్రయల్స్ చేయనున్నారు.