
- పెండ్లి చేసుకుని సెటిల్ అయ్యేందుకు ప్రేమజంట ప్లాన్
- ఐదుగురు నిందితులు అరెస్ట్.. రెండు కార్లు, స్కూటీలు, 7 సెల్ఫోన్లు స్వాధీనం
- మీడియాకు వివరాలు వెల్లడించిన మాదాపూర్ జోన్ఇన్ చార్జ్ డీసీపీ శ్రీనివాస్ రావు
గచ్చిబౌలి, వెలుగు : ఓ ప్రైవేట్ఎంప్లాయ్ కిడ్నాప్కేసులో చెల్లినే ప్రధాన నిందితురాలు అని తేలింది. బాయ్ఫ్రెండ్ని పెండ్లి చేసుకొని లైఫ్సెటిల్అవుదామనుకుని డబ్బుల కోసమే కిడ్నాప్చేయించింది. అతని భార్యకు ఫోన్చేయించి రెండు కోట్లు ఇవ్వాలని డిమాండ్చేసింది. కిడ్నాప్ కేసులో సురేందర్ సోదరి, ఆమె బాయ్ఫ్రెండ్, మరో ముగ్గురిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ జోన్ఇన్ చార్జ్డీసీపీ శ్రీనివాస్రావు ఆదివారం గచ్చిబౌలిలోని తన ఆఫీసులో మీడియాకు వివరాలు తెలిపారు. నల్లగొండ్ల జిల్లాకు చెందిన గుర్రం సురేందర్(35), నాగమణి దంపతులు కేపీహెచ్బీకాలనీలో ఉంటూ జాబ్ చేస్తుండగా ఇరువురికి లక్షల్లో జీతం వస్తుంది.
ఇటీవల అక్కడే వీరు కొత్త ఇల్లు కొని గృహప్రవేశం చేశారు. సురేందర్బాబాయి కుమార్తె నిఖిత(22) కొండాపూర్లోని ఓ ప్రైవేట్హాస్టల్లో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో జాబ్ చేస్తుంది. అదే కంపెనీలో ఏపీలోని కృష్ణ జిల్లా పెద్దపులిపాకకు చెందిన వెంకటకృష్ణ(28) జాబ్ చేస్తున్నాడు. ఇరువురూ కొద్దికాలంగా ప్రేమించుకుంటుండగా, పెండ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. గతంలో వెంకటకృష్ణ గంజాయి, కిడ్నాప్ కేసుల్లో జైలుకు వెళ్లొచ్చాడు. జైలులో ఉండగా.. అత్తాపూర్కు చెందిన సురేశ్(31) పరిచయం అయ్యాడు.
సురేష్ తన వద్ద కిడ్నాప్గ్యాంగ్ ఉందని చెప్పాడు. దీంతో వెంకటకృష్ణ, నిఖిత ఈజీగా మనీ సంపాదించి పెండ్లి చేసుకునేందుకు ప్లాన్చేశారు. నిఖిత తన సోదరుడు సురేందర్ను కిడ్నాప్చేస్తే డబ్బులు ఎక్కువగా వస్తాయని వెంకటకృష్ణకు తెలిపింది. అతను పాత నేరస్తుడు సురేశ్ కు చెప్పగా తన ఫ్రెండ్స్ మెహిదీపట్నంకు చెందిన రాజు(20), రోహిత్(19), కడ్తల్కు చెందిన చందు, అత్తాపూర్కు చెందిన వెంకట్తో కలిసి కిడ్నాప్ ప్లాన్ చేశాడు. సురేందర్ ఇంటివద్ద ఓ సారి కిడ్నాప్ కు రెక్కీ నిర్వహించి విఫలమయ్యారు.
మాట్లాడాలని చెప్పి బయటకు రప్పించి..
కొద్దిరోజుల కిందట సురేందర్తన భార్య, పిల్లలను ఖమ్మంలోని ఆమె పుట్టింటికి పంపాడు. ఇంట్లో అతడు ఒక్కడే ఉండగా కిడ్నాప్చేసేందుకు ఈనెల 4న నిఖిత, వెంకటకృష్ణ కలిసి ఫోన్చేశారు. నిఖిత తనను ఆఫీస్లో ఒకరు వేధిస్తున్నారని, మాట్లాడాలని ఖాజాగూడ లేక్వద్దకు రావాలని సురేందర్ కు చెప్పింది. అదేరోజు సాయంత్రం 6.30 గంటలకు అతడుఅక్కడికి వెళ్లి.. ఆమెతో మాట్లాడుతుండగా స్విఫ్ట్ కారులో సురేశ్, రాజు, రోహిత్, చందు, వెంకట్వచ్చి సురేందర్ను బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లిపోయారు. స్థానికులు వెంటనే డయల్100కి కాల్చేశారు. రాయదుర్గం పెట్రోలింగ్పోలీసులు వెళ్లి నిఖితతో పాటు స్థానికులను ఆరా తీశారు.
నిఖిత పోలీసు స్టేషన్ కు వెళ్లి కిడ్నాప్ కంప్లయింట్ చేసింది. మాదాపూర్జోన్పోలీసులు 6 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. సురేశ్గ్యాంగ్సురేందర్ భార్య నాగమణికి ఫోన్ చేసి రూ. 2 కోట్లు ఇవ్వాలని, లేకపోతే చంపేస్తామని బెదిరించారు. వెంటనే ఆమె ఖమ్మం నుంచి సిటీకి వచ్చింది. అయితే.. కిడ్నాప్ చేసిన కారు ఔటర్రింగు రోడ్డుపై నుంచి కడ్తల్వైపు వెళ్తూ బ్రేక్డౌన్అయింది. మరో కారు పంపించాలని నిఖిత, వెంకటకృష్ణలకు సురేశ్కాల్ చేశాడు. దీంతో సురేందర్ఇంటికి వెళ్లి అతడి కారును తీసుకుని వెంకటకృష్ణ కడ్తల్ వెళ్లాడు.
కిడ్నాపర్లకు అప్ డేట్ ఇస్తూ..
పోలీసులు, కుటుంబసభ్యులకు అనుమానం రానివ్వకుండా నిఖిత జాగ్రత్త పడుతూనే.. ఎప్పటికప్పుడు వివరాలను కిడ్నాపర్లకు చేరవేసింది. కడ్తల్వద్ద వెంకటకృష్ణ కారు ఇవ్వగా, అదితీసుకుని సురేందర్ తో కిడ్నాపర్లు శ్రీశైలం వైపు వెళ్లారు. కారుని ఆత్మకూరు బైరుట్లీ చెక్పోస్ట్ వద్ద అటవీశాఖ అధికారులు ఆపి చెక్ చేశారు. తనను హైదరాబాద్లో కిడ్నాప్చేసి తీసుకువస్తున్నారని సురేందర్ చెబుతుండగా..కారు దిగి కిడ్నాపర్లు అటవీలోకి పారిపోయారు. అనంతరం సురేందర్భార్యకు కిడ్నాపర్ సురేశ్కాల్ చేసి తమకు రూ. 20 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు.
స్పాట్కు వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందాలు శనివారం రాత్రి కిడ్నాపర్లు సురేశ్, వెంకటకృష్ణ, రాజు, రోహిత్ను అదుపులోకి తీసుకొని సిటీకి వచ్చారు. తొలి నుంచి నిఖితను అనుమానించిన రాయదుర్గం పోలీసులు ఆమెను కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. సెల్ఫోన్ డేటా ఆధారంగా కిడ్నాప్ ప్లాన్ బయటపడింది. నిఖిత, వెంకటకృష్ణ, కిడ్నాపర్లు సురేశ్, రాజు, రోహిత్లను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు చందు, వెంకట్లు పరారీలో ఉన్నారు. రెండు కార్లు, రెండు స్కూటీలు, 7 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏ డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ శ్రీనివాస్, రాయదుర్గం ఇన్స్పెక్టర్ మహేశ్, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ జేమ్స్బాబు, ఎస్ఐలు ఉన్నారు