శిల్పకళా వేదికలో అక్కాచెల్లెళ్ల భరతనాట్య అరంగేట్రం అదరహో..

శిల్పకళా వేదికలో  అక్కాచెల్లెళ్ల భరతనాట్య అరంగేట్రం అదరహో..

మాదాపూర్​, వెలుగు: అక్కాచెల్లెళ్ల భరతనాట్య అరంగేట్ర నృత్య ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. మాదాపూర్​లోని శిల్పకళా వేదికలో శుక్రవారం భరతనాట్య గురువు సంతోష్​కుమార్​ తమంగ్​ పర్యవేక్షణలో కొత్తకాపు హర్షిత రెడ్డి, కొత్తకాపు రుచితారెడ్డి భరతనాట్య ప్రదర్శనతో మరిపించారు. 

షణ్ముఖ కౌత్వం, అలరిపు, జతిస్వరం, శబ్ధం, పదవర్ణం, నటనం, ఆడినార్, రామచంద్ర భజన, తిల్లాన అంశాలను అద్భుతంగా ప్రదర్శించారు. కార్యక్రమంలో హర్షిత, రుచిత తల్లిదండ్రులు గాయత్రి, జగన్మోహన్​రెడ్డి, భరతనాట్య గురువు డాక్టర్ ఇందిరా హేమ, కూచిపూడి గురువు డాక్టర్ విజయపాల్ పతోత్, వోకల్స్ జయకుమార్ భరద్వాజ పాల్గొన్నారు..