TSPSC : ముగిసిన సిట్ విచారణ.. మరో ముగ్గురు అరెస్టు

TSPSC : ముగిసిన సిట్ విచారణ.. మరో ముగ్గురు అరెస్టు

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ విచారణ ముగిసింది. కస్టడీకి తీసుకున్న నిందితులు.. ప్రవీణ్, రాజశేఖర్, డాకియా, రాజేశ్వర్ లను హిమాయత్ నగర్ లోని సిట్ కార్యాలయానికి తరలించి విచారించారు. ఇప్పటికే పేపర్ లీక్ వ్యవహారంలో 9 మందిని అరెస్ట్ చేసిన సిట్.. మరో ఐదుగురిని అరెస్ట్ చేసింది. ఇవాళ 9 మందిని విచారించగా ఆ నిందితులు ఇచ్చిన సమాచారంతో మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుంది సిట్. 

మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట్ చెందిన ప్రశాంత్ రెడ్డి, షాద్ నగర్ కు చెందిన రాజేంద్ర కుమార్ లను సిట్ రిమాండ్ తరలించింది. వీళ్లతో పాటు మరో ముగ్గురు శమీమ్, సురేష, రమేష్ లను కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో పేపర్ లీక్ వ్యవహారంలో సిట్ అరెస్ట్ చేసిన వాళ్ల సంఖ్య 15 కు చేరింది. విచారణ పూర్తయిన తర్వాత సిట్ నిందితులందరినీ జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించింది.