ప్రణీత్ రావుకు సిట్ నోటీసులు..రేపు(జూన్ 13) విచారణకు రావాలని ఆదేశం

ప్రణీత్ రావుకు సిట్ నోటీసులు..రేపు(జూన్ 13) విచారణకు రావాలని ఆదేశం

 

  •  ఎల్లుండి(జూన్​ 14)  ప్రభాకర్ రావు విచారణ
  •  హార్డ్ డిస్కుల ధ్వంసంపై దర్యాప్తు
  •  ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు హైదరాబాద్ కు రావడంతో దర్యాప్తులో సిట్ వేగం పెంచింది. రేపు విచారణకు రావాలంటూ ప్రణీత్ రావుకు నోటీసులు జారీ చేసింది. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ ఆధారాలను ధ్వంసం చేసినట్టు అభియోగం ఉంది. రెండు రోజుల పాటు ప్రభాకర్ రావును ప్రశ్నించిన సిట్.. ఆయన చెప్పిన సమాధానాల ఆధారంగా రేపు మరోమారు ప్రణీత్ రావును ప్రశ్నించనుంది.

 ఎవరి ఆదేశాల మేరకు హార్డ్ డిస్కులు ధ్వంసం చేశారన్నది తేల్చేందుకే నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తనకేం సంబంధం లేదంటూ సిట్ కు తెలిపిన విషయం విదితమే.. ప్రణీత్ రావును చెప్పిన సమాధానాల ఆధారంగా ఎల్లుండి మరో మారు ప్రభాకర్ రావును విచారించేందుకు  సిట్ రెడీ అవుతోంది.