ఆరుగురు జూదరుల అరెస్ట్

ఆరుగురు జూదరుల అరెస్ట్

చేర్యాల, వెలుగు: మద్దూరు పీఎస్​పరిధిలోని సలాక్​పూర్​ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురిని శనివారం పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి రూ.70,000 నగదు, 6 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సలాక్​పూర్​ గ్రామానికి చెందిన కాసు ఇన్నారెడ్డి,  విరుపాక మహేందర్​రెడ్డి,  ఇన్న దినేశ్,​ ఇరువ రంజిత్​రెడ్డి, మామిడి గోపీకృష్ణ, దేవీ భూపాల్ ను పీఎస్​తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.