నిద్రిస్తున్న వారిపై కూలిన పైకప్పు.. ముగ్గురు మృతి

నిద్రిస్తున్న వారిపై కూలిన పైకప్పు.. ముగ్గురు మృతి

దేశంలో కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల పాత భవనాలు మెత్తబడి కూలుతున్నాయి. తాజాగా పంజాబ్, అమృత్ సర్ లోని గురనానక్ పురా ప్రాంతంలో వర్షాల వల్ల ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం రాత్రి ఈ ప్రాంతంలో భారీగా వర్షం కురిసింది. దాంతో ఇంటి గోడలు బాగా మెత్తబడి రాత్రి 2 గంటల సమయంలో ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో 9 మంది ఉన్నారు. గాయపడిన వారిని అమృత్ సర్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. ఆ ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు.

మూడు రోజుల క్రితం మహారాష్ట్రలో ఓ ఐదంతస్తుల భవనం కూలి 15 మంది చనిపోయారు. ఆ ఘటనను మరవకముందే ఈ ఘటన జరిగింది. పాతబడ్డ ఇళ్లలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

For More News..

ప్రభుత్వాన్ని మెల్కోలపడానికే కాంగ్రెస్ పార్టీ ఆస్పత్రుల పరిశీలన

ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించాల్సిందే: సుప్రీంకోర్టు

జర్నలిస్టులకు రూ. 50 లక్షల ఇన్సురెన్స్ కల్పించిన అస్సాం