అందరూ డిసెంబర్ 20న ఫోన్​స్విచాఫ్​ చేయండి

అందరూ డిసెంబర్ 20న ఫోన్​స్విచాఫ్​ చేయండి

హైదరాబాద్​, వెలుగు : విపరీతంగా మొబైల్​ఫోన్ ​వాడకంతో కలిగే అనర్థాల గురించి తెలియజేయడానికి స్మార్ట్​ఫోన్​ మేకర్​ వివో ‘స్విచాఫ్​’ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది.   ఈ నెల 20న అందరూ తమ కస్టమర్లు అందరూ స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌లను స్విచ్ ఆఫ్ చేయాలని  కోరింది. 

ఆ రోజు రాత్రి 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తమతమ    కుటుంబాలతో మాట్లాడాలని వివో ప్రజలను కోరింది. తాము చేసిన సర్వేలో.. 77 శాతం మంది తల్లిదండ్రులు, పిల్లలు విపరీతంగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారని ఫిర్యాదు చేశారని వివో తెలిపింది. తల్లిదండ్రులకూ ఫోన్​ వ్యసనంగా మారిందని పేర్కొంది.