
హైదరాబాద్, వెలుగు : విపరీతంగా మొబైల్ఫోన్ వాడకంతో కలిగే అనర్థాల గురించి తెలియజేయడానికి స్మార్ట్ఫోన్ మేకర్ వివో ‘స్విచాఫ్’ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ నెల 20న అందరూ తమ కస్టమర్లు అందరూ స్మార్ట్ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాలని కోరింది.
ఆ రోజు రాత్రి 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తమతమ కుటుంబాలతో మాట్లాడాలని వివో ప్రజలను కోరింది. తాము చేసిన సర్వేలో.. 77 శాతం మంది తల్లిదండ్రులు, పిల్లలు విపరీతంగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారని ఫిర్యాదు చేశారని వివో తెలిపింది. తల్లిదండ్రులకూ ఫోన్ వ్యసనంగా మారిందని పేర్కొంది.