అమేథీలో స్మృతి ఇరానీ నామినేషన్ దాఖలు

అమేథీలో స్మృతి ఇరానీ నామినేషన్ దాఖలు

అమేథీ: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ స్థానానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నామినేషన్‌ దాఖలు చేశారు. 2019లో గెలిచిన ఆమె బీజేపీ అభ్యర్థిగా రెండోసారి బరిలోకి దిగారు. సోమవారం డిస్ట్రిక్ ఎలక్షన్ ఆఫీసర్ నిశా అనంత్​కు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించా రు. అంతకు ముందు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్​తో కలిసి 3 కిలోమీటర్ల మేర ఆమె రోడ్ షో నిర్వహించారు. ప్రధాని మోదీ ఆశీర్వాదంతో మరోసారి అమేథి ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిదని ఆమె పేర్కొన్నారు.