పాము కాట్ల కుంభకోణం: చచ్చినోళ్లను ఎన్నిసార్లు సంపుతరు రా..! రూ.11 కోట్లు స్వాహా

పాము కాట్ల కుంభకోణం: చచ్చినోళ్లను ఎన్నిసార్లు సంపుతరు రా..! రూ.11 కోట్లు స్వాహా

Snakebite Scam: దేశంలో రోజుకో రకం స్కామ్స్ బయటకు వస్తున్నాయి. అయితే తాజాగా మధ్యప్రదేశ్‌లోని రాష్ట్రంలో పాము కాట్లకు సంబంధించిన పెద్ద స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో అధికారులు సియోని జిల్లాలో జరిగిన అతిపెద్ద కుంభకోణాన్ని బయటపెట్టడం గమనార్హం. 

వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం పాముకాట్లు, పిడుగుపాటు, నీళ్లలో మునిగి చనిపోవటం వంటి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తుంటుంది. అయితే వీటికి సంబంధించిన నకిలీ బిల్లులు సమర్పించి  సియోని జిల్లా కియోలారి తహసీల్ చేసిన స్కామ్ జబల్పూర్ నుండి ఆర్థిక శాఖ నిర్వహించిన దర్యాప్తులో వెల్లడైంది. ఇందులో ఒక పురుషుడు 30 సార్లు పాము కాటుకు మరణించినట్లు అలాగే ఒక మహిళ పాము కాటుతో 29 సార్లు మరణించినట్లు నకిలీ బిల్లులను ప్రభుత్వానికి సమర్పించినట్లు గుర్తించారు.

దీంతో  ప్రభుత్వం నుంచి రూ.11కోట్ల 26 లక్షలను 47 మంది బ్యాంక్ ఖాతాల్లోకి జమయ్యాయని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఫైనాన్స్ అధికారులు కుంభకోణానికి పాల్పడినట్లు భావిస్తున్న అసిస్టెంట్ గ్రేడ్ III సచిన్ దహాయక్ ఆ మొత్తాన్ని తన కుటుంబం, స్నేహితులు, పరిచయస్తుల ఖాతాల్లోకి బదిలీ చేశాడని తేలింది. వాస్తవానికి నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు వెళ్లాల్సిన మెుత్తాన్ని వ్యక్తిగత ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నట్లు తేల్చారు అధికారులు. 

2018 నుంచి 2022 వరకు స్కామ్ కొనసాగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కియోలారి తహసీల్ రికార్డుల్లో రమేష్ అనే వ్యక్తి పాము కాటుతో 30 సార్లు, ద్వారిక బాయి 29 సార్లు, రామ్ కుమార్ 28 సార్లు 'మరణించారని' రికార్డ్ అయ్యింది. ప్రక-ృతి వైపరీత్యాలు లేదా పాముకాటుతో మరణించిన వారి కుటుంబాలకు ఎంపీ ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కియోలారి తహసీల్ సిబ్బంది ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో ఉన్న కొన్ని వాడుకుని స్కామ్ చేశారని కూడా దర్యాప్తులో తేలింది.

ప్రభుత్వ ఖాతా నుంచి చెల్లింపులు విడుదల చేయటానికి ఆధారమైన లాగిన్, ఐడీలను దుర్వినియోగం చేసినట్లు గుర్తించబడింది. మెుత్తం మీద ప్రకృతి విలయాలు, ప్రమాదాల వల్ల నష్టపోయిన కుటుంబాలకు అందించాల్సిన రూ.23.81 కోట్ల ఆర్థిక సహాయం మధ్యప్రదేశ్‌లోని 13 జిల్లాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు, వారి బంధువులు, అనర్హులైన వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లించబడినట్లు ఆడిట్ రిపోర్టు తేల్చింది.