
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మధురానగర్ కాలనీలో నిరుపయోగంగా ఉన్న నర్సరీ పాములకు నిలయంగా మారుతోంది. కాలనీలో ఐదెకరాల స్థలంలో మునిసిపల్ అధికారులు నర్సరీని నిర్వహించగా.. కొన్ని రోజుల క్రితం అది మూత పడింది. దీంతో ఆ స్థలంలో పిచ్చిమొక్కలు పెరిగి పాములు తిరుగుతున్నాయి.
కాలనీలో ఇండ్ల మధ్యకు అవి వస్తుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆ స్థలాన్ని కమిటీ హాల్కు కేటాయించి పిచ్చి మొక్కలను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.