భారీ నష్టాల్లో స్నాప్ చాట్ : భారీగా పెరిగిన యూజర్లు

భారీ నష్టాల్లో స్నాప్ చాట్ : భారీగా పెరిగిన యూజర్లు

ప్రముఖ ఫొటో మెసేజింగ్‌ యాప్‌ స్నాప్‌చాట్‌ (Snapchat) తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు (Features) తీసుకొస్తోంది. గతంతో కంటే ఇప్పుడు యూజర్లు మరింత పెరిగారు. ఇతర సోషల్​మీడియా యాప్స్​కంటే వేగంగా ఆప్​డేట్​అవుతోంది స్నాప్ చాట్. మార్కెట్​లో ఇతర పోటీదారులను ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ముందుకొస్తోంది. 

2023 సెప్టెంబర్​30వ తేదీతో ముగిసే త్రైమాసికంలో రూ.368 మిలియన్ల నికర నష్టాన్ని చవిచూసింది. అయితే.. గత ఏడాది ఫలితాలతో పోలిస్తే మాత్రం ఇది స్వల్పంగా మెరుగుపడిందంటున్నారు బిజినెస్​ నిపుణులు. ఏడాది తర్వాత కంపెనీ చీఫ్​ఆపరేటింగ్​ఆఫీసర్​గా పని చేస్తున్న జెర్రీ హంటర్ పదవీ విరమణ చేయనున్నారు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన్నే కొనసాగించాలని స్నాప్ చాట్​సంస్థ భావిస్తోంది. 2024, జులై 1వ తేదీ వరకూ జెర్రీ హంటర్ ను సంస్థలోనే కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు సీఈఓ ఇవాన్ స్పీగెల్ చెప్పారు. 

ఈ ఏడాది మొత్తం ఆదాయం దాదాపు రూ.1.2 బిలియన్లు. ఇది గత ఏడాదితో పోలిస్తే 5 శాతం పెరుగుదలను సూచిస్తోంది. అంతేకాదు.. స్నాప్​చాట్ వినియోగదారులు కూడా అంతకంతకూ పెరుగుతున్నారు. స్నాప్ చాట్ సంస్థ.. ఇప్పుడు ఆదాయంపై ఫోకస్ పెట్టింది. ఇదే క్రమంలో స్నాప్ చాట్ ను మరింత మెరుగుపర్చాలని.. వినియోగదారులకు ఆప్​గ్రేడ్​తో కూడిన సేవలు అందించాలని నిర్ణయించింది. డిసెంబర్ త్రైమాసికం వరకు ఇప్పుడున్న 410 మిలియన్ల వినియోగదారులను 412 మిలియన్లకు చేరుకోవాలని సంస్థ భావిస్తోంది. 

ALSO READ:ఆయనకు మాత్రమే లిప్ లాక్.. శ్రీలీల క్రేజీ కామెంట్స్

వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ల్యాండ్​స్కేప్ లో స్నాప్ చాట్.. ఫేస్​బుక్, ఇన్​స్ట్రాగ్రామ్, టిక్​టాక్​వంటి ఫ్లాట్​ఫామ్స్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. మరోవైపు.. వినియోగదారుల సంఖ్య పెరిగినప్పటికీ... 368 మిలియన్ల నికర నష్టాన్ని చవిచూసింది సంస్థ.