- రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో ఘటన
హైదరాబాద్: ఆరో అంతస్తుపై నుంచి పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి చెందిన విషాద ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గచ్చిబౌలి టెలికామ్ నగర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుస్తున్న పిడుగు సురేంద్రరెడ్డి (30) స్థానికంగా ఉన్న పీజీ హాస్టల్లో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. ఇవాళ ఈరోజు హాస్టల్ భవనం 6వ అంతస్తు పై నుండి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
FOR MORE NEWS:
ప్రభుత్వం నిజాలు చెప్పడానికి భయపడుతోంది
జాబ్స్ పేరుతో మోసం.. మంత్రి, ఎమ్మెల్యేల హస్తం