కేపీహెచ్బీలో విషాదం.. హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్న.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ బైక్ ఢీ కొని మృతి

కేపీహెచ్బీలో విషాదం.. హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్న.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ బైక్ ఢీ కొని మృతి

కూకట్​పల్లి, వెలుగు: బైక్ ​ఢీకొని ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందిన ఘటన కేపీహెచ్బీ పోలీస్​స్టేషన్​పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నడ గ్రామానికి చెందిన ఆదాడ శ్రీకాంత్(29) కూకట్​పల్లిలో ఉంటూ హైటెక్​సిటీలో సాఫ్ట్​వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు.

శనివారం అర్ధరాత్రి ఆటోలో వచ్చి జేఎన్టీయూ చౌరస్తాలో దిగాడు. అక్కడి నుంచి కేపీహెచ్బీ పోలీస్​స్టేషన్​ వైపు రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో మియాపూర్​వైపు నుంచి వేగంగా వచ్చిన బైక్ ఢీ కొట్టటంతో తీవ్రంగా గాయపడ్డాడు. హాస్పిటల్కు తరలించగా మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.