
కూకట్పల్లి, వెలుగు: బైక్ ఢీకొని ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందిన ఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నడ గ్రామానికి చెందిన ఆదాడ శ్రీకాంత్(29) కూకట్పల్లిలో ఉంటూ హైటెక్సిటీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు.
శనివారం అర్ధరాత్రి ఆటోలో వచ్చి జేఎన్టీయూ చౌరస్తాలో దిగాడు. అక్కడి నుంచి కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ వైపు రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో మియాపూర్వైపు నుంచి వేగంగా వచ్చిన బైక్ ఢీ కొట్టటంతో తీవ్రంగా గాయపడ్డాడు. హాస్పిటల్కు తరలించగా మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.