30న ‘లక్కీ లక్ష్మణ్’ విడుదల

30న ‘లక్కీ లక్ష్మణ్’ విడుదల

‘బిగ్‌‌ బాస్‌‌’ ఫేమ్ సయ్యద్ సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్.అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మించిన చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. డిసెంబర్ 30న విడుదల. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో హీరో సోహైల్ మాట్లాడాడు. ‘ఇది ఫ్యామిలీ సబ్జెక్ట్. కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రం. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నవ్వుతారు. డైరెక్టర్ అభి చాలా బాగా తీశారు. ప్రేక్షకులే నా ధైర్యం. వాళ్లంతా నా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నాడు. 

అనంతరం దర్శకుడు హరిత గోగినేని మాట్లాడారు ‘సోహైల్‌‌తో సహా సినిమాలోని ప్రతీ పాత్రకు సెకండ్ చాయిస్ లేదు. ఆ విషయంలో నేను చాలా లక్కీ. థియేటర్ నుంచి బయటకు వచ్చాక మంచి సినిమా చూశామని ఫీల్ అవుతారు’ అన్నాడు. ‘బడ్జెట్ పరంగా చిన్న సినిమానే అయినా కంటెంట్‌‌ పరంగా పెద్ద సినిమా. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో థియేటర్లో రిలీజ్ చేస్తున్నాం’ అని నిర్మాత అన్నారు. దర్శకనిర్మాతలకు హీరోయిన్ మోక్ష థ్యాంక్స్ చెప్పింది. నటులు రాజా రవీంద్ర, సమీర్, దేవీ ప్రసాద్, రాహుల్ సిప్లిగంజ్, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, సాయి రాజేష్, ఆర్పీ పట్నాయక్ పాల్గొని టీమ్‌‌కు ఆల్‌‌ ద బెస్ట్ చెప్పారు.