డివైడర్ను ఢీకొట్టిన సాల్వెంట్ డ్రమ్ముల డీసీఎం.. తప్పిన పెను ప్రమాదం

డివైడర్ను ఢీకొట్టిన సాల్వెంట్ డ్రమ్ముల డీసీఎం.. తప్పిన పెను ప్రమాదం

సంగారెడ్డి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పటాన్ చెరు మండలం కర్దనూర్ ఓఆర్ఆర్ పై సాల్వెంట్ డ్రమ్ముల లోడుతో వెలుతున్న డీసీఎం అదుపుతప్పి డివైడర్ ని ఢీకొంది. దీంతో  సాల్వెంట్  డ్రమ్ములన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ డ్రమ్ములు పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో డ్రైవర్ శ్రీనివాస్ కు గాయాలయ్యాయి. కర్నూల్ నుంచి హైదరాబాద్ సూరారంకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.