చందుర్తి మండలంలో తండ్రిని కారుతో గుద్ది చంపిన కొడుకు అరెస్ట్ 

చందుర్తి మండలంలో తండ్రిని కారుతో గుద్ది చంపిన కొడుకు అరెస్ట్ 

చందుర్తి, వెలుగు: తండ్రిని కారుతో గుద్ది చంపిన కొడుకును అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం చందుర్తి పీఎస్‌‌‌‌‌‌‌‌లో మీడియాకు వివరాలు వెల్లడించారు. చందుర్తి మండలం దేవునితండాకు చెందిన జాటోత్‌‌‌‌‌‌‌‌ తిరుపతినాయక్​ తాగుడుకు బానిసై కుటుంబసభ్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.

 సోమవారం అతని భార్య అమీనాను కొట్టాడు. విషయం తెలుసుకున్న కొడుకు రాజేశ్‌‌‌‌‌‌‌‌ ఆవేశంగా వచ్చి రోడ్డుపై నిల్చున్న తండ్రిని కారుతో ఢీకొట్టాడు. కిందపడిన తండ్రిని రెండు, మూడుసార్లు కారుతో తొక్కించాడు. తీవ్రంగా గాయపడిన తిరుపతిని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలిస్తుండగా చనిపోయాడు. మంగళవారం నిందితుడు రాజేశ్‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసినట్లు సీఐ తెలిపారు.