కారు రివర్స్​ తీస్తుండగా.. బాలుడు మృతి

కారు రివర్స్​ తీస్తుండగా.. బాలుడు మృతి

తండ్రి కారు కిందపడి కొడుకు మృతిచెందని విషాద ఘటన ఎల్బీనగర్‎లో చోటుచేసుకుంది. జహీరాబాద్‎కు చెందిన అంగిర్ల లక్ష్మణ్, రాణి దంపతులు సిటీకి వచ్చి మన్సూరాబాద్‎లోని కాస్మోపాలిటన్ కాలనీలోని ఓ అపార్ట్‎​మెంట్​లో వాచ్‎మెన్‎గా చేరారు. వీరికి కుమార్తె భవాని(4), కొడుకు సాత్విక్( ఏడాదిన్నర) ఉన్నారు. ఆదివారం ఉదయం10 గంటల సమయంలో లక్ష్మణ్​ అపార్ట్​మెంట్​లోకి కారును రివర్స్ తీస్తుండగా.. అక్కడే ఆడుకుంటున్న అతని కొడుకు సాత్విక్ కారు వద్దకు పరిగెత్తుకొచ్చాడు. అది గమనించకుండా.. లక్ష్మణ్ కారును అలాగే వెళ్లనీయడంతో.. సాత్విక్ మీదుగా కారు వెళ్లింది. దాంతో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే సాత్విక్‎ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కేసు ఫైల్ చేశామని ఎల్​బీనగర్​ ఇన్​స్పెక్టర్​ అశోక్ రెడ్డి తెలిపారు.