హైదరాబాద్, వెలుగు: ఎస్ఎస్ ఇన్నోవేషన్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఎస్ఎస్ఐఐ మంత్ర ద్వారా 100 రోబోటిక్ టెలి సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మైలురాయిని సాధించిన సందర్భంగా మనదేశంలోనే మొదటిసారిగా రోబోటిక్ టెలిసర్జరీ మారథాన్ను నిర్వహించింది.
ఒకే రోజులో 20 కన్నా ఎక్కువ రోబోటిక్ సర్జరీలు చేసి సత్తా చాటామని ప్రకటించింది. ఈ అధునాతన వ్యవస్థ ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా నిపుణులైన వైద్య సేవలను అందించవచ్చని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ అన్నారు. దేశవ్యాప్తంగా సురక్షితమైన, నమ్మదగిన మెడికల్ టెక్నాలజీలను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
