బీజేపీలో చేరిన కేంద్ర మాజీ రక్షణ మంత్రి కొడుకు

బీజేపీలో చేరిన కేంద్ర మాజీ రక్షణ మంత్రి కొడుకు

కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తర భారత దేశంలో బీజేపీ తన భలాన్ని మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. పలు పార్టీల నేతలను బీజేపీలోకి చేర్పించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎకే. ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ బీజేపీ కండువా కప్పుకున్నారు.  గురువారం కేంద్ర మంత్రి పియూష్ గోయల్, వీ. మురళీధరన్ సమక్షంలో బీజేపీలో చేరారు. 

బీజీపీ కండువా కప్పుకున్న తర్వాత అనిల్ ఆంటోనీ మాట్లాడుతూ.. ‘చాలామంది కాంగ్రెస్ నాయకులు తమ కర్తవ్య మరిచి ఒక కుటుంబం కోసం పని చేస్తున్నారు. ప్రజల కోసం పని చేయడమే నా కర్తవ్యం. బీజేపీ ఒక విజన్ తో ఉన్న పార్టీ. మోడీ ఆ విజన్ కోసం పనిచేస్తున్నారు. రాబోయే 25 ఏళ్లలో భారత్ అభివద్ధి చెందిన దేశంగా ఎదుగుతుంద’ని అన్నారు.