తండ్రిని చంపిన కొడుకుకు రిమాండ్ ..

తండ్రిని చంపిన కొడుకుకు రిమాండ్ ..

చేవెళ్ల, వెలుగు: తండ్రిని హత్య చేసిన కొడుకును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు పంపారు.  మొయినాబాద్ మండలం మూర్తుజాగూడకు చెందిన అజ్జూఖాన్​(50) కూలీ పనులు చేస్తుంటాడు. పని చేస్తానని చెప్పి ఓ వ్యక్తి వద్ద డబ్బులు తీసుకున్నాడు. కానీ పని  చేయకపోవడంతో వారు నిలదీశారు. పనికి వెళ్లకుండా నిత్యం మద్యం తాగుతుండడంతో కొడుకు అజీంఖాన్​కు కోపం వచ్చింది. ఈ నెల 6న కర్రతో తండ్రిని విచక్షణారహితంగా కొట్టాడు. ఆయనను కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు హాస్పిటల్​కు తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 14న మృతిచెందాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న అజీమ్ ఖాన్ ను సోమవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.