పీకే విషయంలో హైకమాండ్దే తుది నిర్ణయం

పీకే విషయంలో హైకమాండ్దే తుది నిర్ణయం

హైదరాబాద్: కాంగ్రెస్ లో పీకే చేరికపై కాంగ్రెస్ హైకమాండ్ ఓ కమిటీ వేసిందని, ఆ కమిటీ నివేదిక తర్వాత సోనియాగాంధీ తుది నిర్ణయం తీసుకుంటారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పీకే కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ పలు పార్టీల నాయకులు తమకు  తోచినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారన్న ఆయన... కొందరు పనిగట్టుకొని ఆరోపణలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. లేనిపోని విషయాలను సోషల్ మీడియాలో పెట్టి బీజేపీ విషప్రచారం చేస్తోందని పేర్కొన్న భట్టి... మాణిక్కం ఠాగూర్ ట్వీట్ లో తప్పేముందని ప్రశ్నించారు. శత్రువును నమ్మొద్దు అని మాణిక్కం ఠాగూర్ అన్నారు... కానీ శత్రువు ఎవరో చెప్పారా? అంటూ భట్టి విక్రమార్క నిలదీశారు. 

మరికొన్ని వార్తల కోసం...

డబుల్ బెడ్రూం ఇళ్లపై 2 నెలల్లో నివేదిక ఇవ్వండి

ఏటా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తాం