నేషనల్​ హెరాల్డ్​ వ్యవహారంలో సోనియా, రాహుల్కు రూ. 142 కోట్ల లబ్ధి.. ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ఈడీ వాదనలు

నేషనల్​ హెరాల్డ్​ వ్యవహారంలో సోనియా, రాహుల్కు రూ. 142 కోట్ల లబ్ధి.. ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ఈడీ వాదనలు

న్యూఢిల్లీ: నేషనల్​ హెరాల్డ్​ వ్యవహారం లో కాంగ్రెస్​ నేతలు సోనియా, రాహుల్​ గాంధీ అనుచితంగా రూ. 142 కోట్ల లబ్ధి పొందారని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) ఆరోపించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని రౌస్​ అవెన్యూ ప్రత్యేక కోర్టులో వాదనలు వినిపించింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్​ జరిగిందని, కేసు కూడా నమోదు చేసిన ట్లు వెల్లడించింది.  స్పెషల్​ జడ్జి విశాల్​ గోగ్నే  వాదనలు విన్నారు.

2014లో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదు చేయగా.. 2021లో ఈడీ ఎంటరై దర్యాప్తును ప్రారంభించింది. 2023 నవంబర్​లో ఆస్తులను అటాచ్​ చేసింది. ఈడీ కేసులో సోనియా, రాహుల్​, శామ్​ పిట్రోడో, సుమన్​ దుబే, యంగ్​ ఇండియా ప్రైవేట్​ లిమిటెడ్​, మరో రెండు సంస్థలు నిందితులుగా ఉన్నారు.