రణ్ థంబోర్ టైగర్ సఫారీలో సోనియా, రాహుల్ టూర్

రణ్ థంబోర్ టైగర్ సఫారీలో సోనియా, రాహుల్ టూర్

సోనియాగాంధీ తన పుట్టినరోజు వేళ కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీలతో కలిసి రణ్ థంబోర్ నేషనల్ పార్క్ లోని టైగర్ సఫారీలో విహరించారు.  ఈ పార్క్ రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ లో ఉంది. ప్రస్తుతం ఇదే రాష్ట్రంలోని కోటా జిల్లా మీదుగా రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర కొనసాగుతోంది. అయితే తన తల్లికి 76వ బర్త్ డే విషెస్ చెప్పేందుకు.. రాహుల్ గాంధీ నేరుగా కోటా జిల్లా నుంచి రణ్ థంబోర్ నేషనల్ పార్క్ కు వచ్చారు. 

రాహుల్, సోనియా ఒక ఓపెన్ టాప్ జీప్ (జిప్సీ) లో కూర్చొని టైగర్ సఫారీ మొత్తం తిరిగారు.  దీనికి సంబంధించిన ఒక ఫొటోను రణ్ థంబోర్ పార్క్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్  చేసింది.  రాహుల్, ప్రియాంక, సోనియాగాంధీ ముగ్గురూ ఒకే వాహనంలో కూర్చొని వెళ్లి..  రణ్ థంబోర్ పరిధిలోనే ఉన్న జోగి మహల్ ను సందర్శించారు. వీరంతా రణ్ థంబోర్ లోని విఖ్యాత హోటల్ ‘షేర్ బాగ్’లోనే ఇవాళ రాత్రి కూడా ఉండనున్నారు. ఇదే హోటల్ లో సోనియాగాంధీ బర్త్ డే వేడుకలు జరుగుతాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.  

షేర్ బాగ్ హోటల్ ప్రత్యేకత ఏమిటంటే.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి కూడా 1987 సంవత్సరంలో ఇక్కడికి వచ్చారు. అప్పట్లో వారు దాదాపు వారం పాటు ఇక్కడే ఆతిథ్యం పొంది, టైగర్ సఫారీలో విహరించారు.