దేశంలో అత్యంత సంపన్నురాలు నాగలక్ష్మి

దేశంలో అత్యంత సంపన్నురాలు  నాగలక్ష్మి

ఏపీలోని నెల్లూరుకు చెందిన అంధురాలు బొడ్డు నాగలక్ష్మి. అయినప్పటికీ యూట్యూబ్ వీడియోల ద్వారా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. కరోనా విపత్కర సమయంలో సోనూ సూద్ సేవల గురించి విన్న నాగలక్ష్మి తనవంతు సాయంగా సోనూ సూద్ ఫౌండేషన్ కు తన 5 నెలల పింఛన్  రూ.15 వేలు విరాళంగా అందించింది. దీనిపై ట్విట్టర్ లో స్పందించిన సోనూ సూద్ .. నెల్లూరు జిల్లా వరికుంటపాడుకు చెందిన నాగలక్ష్మి తన ఐదు నెలల పింఛను సొమ్మును తనకు విరాళంగా ఇచ్చిందని వెల్లడించారు. తనవరకు నాగలక్ష్మే అత్యంత సంపన్న భారతీయురాలు అని కొనియాడారు. ఎదుటి వ్యక్తి బాధను చూడ్డానికి కంటి చూపు అవసరం లేదని నిరూపించిందని.. నాగలక్ష్మి నిజమైన హీరో అని సోనూ సూద్ కొనియాడారు.